Free Bus : ఉచిత బస్సు పథకం ద్వారా 15 కోట్ల మంది ప్రయాణం.. రికార్డు సృష్టించిన ఆర్టీసీ

ఇప్పటి వరకూ తెలంగాణలో పదిహేను కోట్ల మంది మహిళ ప్రయాణికకులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు

Update: 2024-02-10 06:20 GMT

ఆర్టీసీ యాజమాన్యం నేడు పెద్దయెత్తున కార్యక్రమం చేపట్టనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ఆర్టీసీ సంబురాలను నిర్వహించనుంది. మహాలక్ష్మి పథకం పూర్తిగా విజయవంతమయినందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన ఆర్టీసీ మరో ఘనతను సాధించింది.

నేడు ఆర్టీసీ సంబురాలు....
ఇప్పటి వరకూ తెలంగాణలో పదిహేను కోట్ల మంది మహిళ ప్రయాణికకులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడంతో ఈ సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్ లో కొత్త బస్సులను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు.


Tags:    

Similar News