Revanth Reddy : నేడు నాలుగు నియోజకవర్గాలకు రేవంత్

ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాలుగు సభల్లో పాల్గొంటారు

Update: 2023-11-20 03:50 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజుల సమయమే మిగిలి ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరం చేశాయి. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాలుగు సభల్లో పాల్గొంటారు. వరస సభలతో అధికార పార్టీపై విరుచుకుపడనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇటీవల విడుదల చేసిన మ్యానిఫేస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి తన ప్రచారం ద్వారా ప్రయత్నం చేయనున్నారు. నాలుగు సభల్లో సుడిగాలి పర్యటన చేయనున్న రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయనున్నారు.

వరస సభలతో...
ఈరోజు రేవంత్ రెడ్డి నరసాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లిలో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నరసాపూర్లో నియోజకవర్గంలో జరగనున్న సభ మధ్యాహ్నం పన్నెండు గంటలకు, పరకాల సభ మూడు గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు ఖైరతాబాద్ సభలోనూ, ఎనిమిది గంటలకు నాంపల్లిలో జరిగే సభలోనూ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తాము ఏం చేస్తామో చెప్పనున్నారు.


Tags:    

Similar News