త్రిపుర సీఎం పదవికి బిప్లవ్ రాజీనామా

బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే బిప్లవ్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Update: 2022-05-14 11:37 GMT

త్రిపుర : ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కీలక పరిణామం జరిగింది. త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే బిప్లవ్ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బిప్లవ్ కుమార్ 2018లో త్రిపుర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బిప్లవ్ హయాంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురైన దాఖలాలు లేవు. అయినప్పటికీ.. ఆయన అకస్మాత్తుగా సీఎం పదవికి రాజీనామా చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. బీజేపీ మరో వ్యక్తిని సీఎంను చేసేందుకే బిప్లవ్ తో రాజీనామా చేయించిందని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.



Tags:    

Similar News