ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ - పది మంది మావోల మృతి

ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు

Update: 2025-01-21 03:59 GMT

ఛత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పది మంది మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్ గడ్ - ఒడిశా సరిహద్దులోని గరియా బంద్ జిల్లాలో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే నిన్నటి నుంచి ఎదురు కాల్పులు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేడు భద్రతా దళాలు మావోయిస్టుల కోసం వెతుకుతుండగా ఈరోజు పది మృతదేహాలు లభ్యమయినట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన జవాన్ ను...
చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ ఎదురు కాల్పుల ఘటనలో ఒక జవాన్ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అయితే గాయపడిన జవాన్ ను హెలికాపర్ట్ లో రాయపూర్ కు తరలించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఇంకా మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.


Tags:    

Similar News