రంగస్థలంలో డ్యాన్సులకైతే ఢోకా లేదు

Update: 2018-03-17 12:16 GMT

రంగస్థలం సినిమా నుండి ఎంత సక్కగున్నావే సాంగ్ ఎంత సెన్సేషన్ అయిందో చెప్పనవసరం లేదు. దాని తర్వాత వచ్చిన రెండు సాంగ్స్ కూడా అదే రేంజ్ లో వున్నాయి. ఇక లేటెస్ట్ గా సినిమా ఆల్బం మొత్తం రిలీజ్ చేసారు టీం. ఈ ఆల్బంలో ఒకొక్క సాంగ్ ఒకొక్క రేంజ్ లో వున్నాయి.

ఈ ఆల్బంలో మొత్తం 5 సాంగ్స్ వున్నాయి. కానీ ఇందులో ఇంకో సాంగ్ కూడా ఉందంట. అయితే అది సినిమాలో మాత్రమే ఉంటుందంట. దాని సంగతేంటో నేరుగా సినిమా చూసే తెలుసుకోవాలి. అయితే ఈ సాంగ్ కు ఓ ప్రత్యేకత వుంది. అది ఏంటంటే..ఈ సాంగ్ లిరిక్ రైటర్ చంద్ర బోస్ పాడారు.

‘ఎంత సక్కగున్నావే’...‘రంగమ్మా మంగమ్మా’ సాంగ్స్ కొంచెం మెలోడీలా వున్నాయి. మిగతా మూడు సాంగ్స్ మాత్రం మాస్ జనాలకు.. డ్యాన్స్ ప్రియులకు విందు భోజనం అయ్యేలాగే కనిపిస్తున్నాయి. రంగా రంగా రంగస్థలాన అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ డప్పులతో మోత మోగించేశాడు. ఇక జిగేల్ రాణి ట్యూన్ అంత శ్రావ్యంగా, క్యాచీగా లేదు కానీ.. ఇందులోనూ డ్యాన్సులకు కొదవ ఉండేలా లేదు. ఈ సాంగ్స్ చరణ్ డాన్స్ ఏ రేంజ్ లో చేసాడో ఆల్రెడీ పూజా హెగ్డే హింట్లిచ్చింది. లాస్ట్ సాంగ్ ఆ గట్టునుంటావో సాంగ్ కొంచెం పొలిటికల్ పంచ్ లా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ‘రంగస్థలం’లో డ్యాన్సులకైతే ఢోకా ఉండదనిపిస్తోంది

Similar News