భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్
భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది
భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. హార్మూజ్ జలసంధిని ఉపయోగించుకోవడానికి భారత్కు ఇరాన్అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యాతో సహా ఐదు స్నేహపూర్వక దేశాలకు అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు.
హార్మూజ్ జలసంధి...
దీంతో హార్మూజ్ జలసంధిలో నౌకలు ప్రయాణిస్తే భారత్ కు ఎల్.పి.జీ ఇంధన కష్టాలు తీరినట్టేనని అనుకోవాల్సి ఉంటుంది. కాకపోతే, ఇరాన్ అనుమతించినా అమెరికా దాడులు చేస్తుందనే భయం మాత్రం ఉన్నప్పటికీ, భారత్ విషయంలో అమెరికా కూడా స్నేహ పూర్వక వైఖరి ప్రదర్శించే అవకాశముందని అంటున్నారు.