న్యూయార్క్ లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

మిలటరీ దుస్తులు వేసుకుని ఉన్న ఓ దుండగుడు నిన్న మధ్యాహ్నం న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో ఉన్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్

Update: 2022-05-15 04:05 GMT

న్యూయార్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లోని ఓ సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మిలటరీ దుస్తులు వేసుకుని ఉన్న ఓ దుండగుడు నిన్న మధ్యాహ్నం న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో ఉన్న టాప్స్ ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు పాల్పడిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా.. కాల్పుల ఘటనను నిందితుడు తన హెల్మెట్‌కు అమర్చిన కెమెరా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత సూపర్ మార్కెట్‌లోకి చొరబడి లోపలున్నవారిపై కాల్పులు జరిపిన నిందితుడు.. వెళ్తూవెళ్తూ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న వారిపైనా కాల్పులు జరిపినట్టు హెల్మెట్‌కు అమర్చిన కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది.
ఇటీవల పదవీ విరమణ పొందిన ఓ పోలీసులు అధికారి ఇటీవలే ఆ సూపర్ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరారు. ఈ కాల్పుల ఘటనలో ఆయన కూడా మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులు ఎందుకు జరిపాడో తెలియలేదన్న పోలీసులు.. అతడిని విచారణ చేసిన అనంతరం పూర్తి వివరాలు చెప్తామన్నారు. నల్లజాతీయులు ఎక్కువగా నివసించే చోట ఈ ఘటన జరగడంతో జాతి విద్వేషమే కాల్పులకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Tags:    

Similar News