బ్రేకింగ్ : అర్ధరాత్రి మరోసారి గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

విశాఖపట్నం ఎల్.జి. పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. అర్థరాత్రి గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. పరిశ్రమ నుంచి మరోసారి [more]

Update: 2020-05-08 00:51 GMT

విశాఖపట్నం ఎల్.జి. పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. అర్థరాత్రి గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. పరిశ్రమ నుంచి మరోసారి గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. గోపాలపట్నం, సుజాతానగర్, పెందుర్తి, అడివివరం,సింహాచంర, వేపగుంట గ్రామాల ప్రజలు మరోసారి తమ గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు అర్ధరాత్రి తరలి వెళ్లిపోయారు. నిపుణులు గ్యాస్ లీక్ కాకుండా పర్యవేక్షిస్తున్నప్పటికీ మరోసారి గ్యా్ లీక్ కావడం ఆందోళనకుగురి చేస్తోంది. మరోసారి ఎల్జీ పరిశ్రమ నుంచి నాలుగు కిలోమీటర్ల వరకూ విషవాయువు విస్తరించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Tags:    

Similar News