కల్నల్ సంతోష్ కుమార్ భార్య పిల్లలు హైదరాబాద్ కు

కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి భార్య పిల్లలు వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న కల్నల్ సంతోష్ [more]

Update: 2020-06-17 06:26 GMT

కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి భార్య పిల్లలు వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ రిసీవ్ చేసుకున్నారు. కల్నల్ సంతోష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. భార్య సంతోషి ఇద్దరు పిల్లలు కలిసి ఉంటున్నారు. కల్నల్ సంతోష్ బాబు మరణ వార్త వినగానే భార్య సంతోషి కుప్పకూలిపోయింది. మిగతా ఆర్మీ కుటుంబ సభ్యులు కలిసి ఆమెకి మనోధైర్యం చెప్పారు. అయితే ఇవాళ ఉదయం ఆరుగంటల కు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో బయల్దేరారు. తొమ్మిదిన్నర గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సంతోషి , పిల్లలతో కలిసి చేరుకున్నారు. మరోవైపు సాయంత్రం కల్నల్ సంతోష్ బాబు ర్ మృతదేహం హైదరాబాద్ కు చేరుకుంటుంది. హకీంపేట ఎయిర్ పోర్ట్ కి ప్రత్యేక విమానంలో కల్నల్ సంతోష్ బాబు మృతదేహం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. మూడు గంటల ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ కి వచ్చిన మృతదేహాన్ని ప్రత్యేక వాహనాల్లో సూర్య పేట కు తరలిస్తారు . అక్కడ అధికార లాంఛనాలతో కల్నల్ సంతోష్ బాబు మృతదేహం కు రేపు అంత్యక్రియలు చేయనున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News