ఆ అబ్యాయే నన్ను తప్పుదోవ పట్టించాడు

తాను పొరపాటున ఇన్ వాలిడ్ ఓటు వేశానని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మరోసారి స్పష్టం చేశారు. తాను కావాలని ఎంత మాత్రం చేయలేదన్నారు. సోషల్ మీడియాలో [more]

Update: 2020-06-20 07:29 GMT

తాను పొరపాటున ఇన్ వాలిడ్ ఓటు వేశానని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మరోసారి స్పష్టం చేశారు. తాను కావాలని ఎంత మాత్రం చేయలేదన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆదిరెడ్డి భవానీ ఖండించారు. తనతో పాటు అక్కడ ఉన్న వారి పొరపాటు కూడా ఉందని, అందువల్లే చెల్లని ఓటు అయిందన్నారు. తనకు రాజ్యసభ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయడమని, కమ్యునికేషన్ గ్యాప్ వల్ల ఒకటి పెట్టాల్సిన స్థానంలో టిక్ పెట్టానని ఆదిరెడ్డి భవాని చెప్పారు. అక్కడ సిబ్బందిలో ఒకరు తనను తప్పుదోవ పట్టించారని ఆదిరెడ్డి భవానీ తెలిపారు. అసంతృప్తితోనే చెల్లని ఓటు వేశానని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు.

Tags:    

Similar News