స్పీకర్ పై రోజా సంచలన కామెంట్స్

Update: 2017-07-17 07:44 GMT

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్ చేశారు. స్పీకర్ గా గౌరవప్రదమైన ఛైర్ లో ఉంటూ ఆయన టీడీపీ శాసనసభ్యుల మాక్ పోలింగ్ లో పాల్గొనడంపై ఆమె ఆక్షేపించారు. టీడీపీ ఎమ్మెల్యేగా కోడెల వ్యవహరించారని రోజా అన్నారు. గతంలోనూ స్పీకర్ అనేక కార్యక్రమాల్లో తెలుగుదేశం కండువా కప్పుకుని పాల్గొన్నారని ఆరోపించారు. గతంలో స్పీకర్లుగా పని చేసిన నాదెండ్ల మనోహర్, సురేష్ రెడ్డిలు ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని రోజా గుర్తు చేశారు. స్పీకర్ కోడెల దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. ఇదంతా చూస్తుంటే అసెంబ్లీ సమావేశాల్లోనూ జగన్ ను తొక్కేస్తారన్న అనుమానం ఉందని రోజా అన్నారు.

Similar News