సీనియర్ల వేధింపులకు ఇద్దరు బాలికల ఆత్మహత్యాయత్నం

Update: 2017-09-09 07:13 GMT

సీనియర్ల వేధింపులు భరించలేక 8వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని గురుకుల పాఠశాలలలో చోటు చేసుకుంది. గత వారం రోజులుగా సీనియర్లు వేదిస్తున్నారని వారి బారి నుండి కాపాడాలంటూ ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేశారు.. అయినా వేధింపులు ఆగకపోవడంతో గత రాత్రి ఇంటికి పోన్ చేసి తనను తీసుకుని వెళ్లాలంటూ సాయినిధి తల్లిదండ్రులను కోరింది. అంతలోనే ఏమైందో కానీ ఉదయం 5 గంటల ప్రాంతంలో ల్యాబ్ లోకి వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు కెమికల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన తోటి స్నేహితులు ప్రిన్సిపాల్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరికీ చికిత్స కొనసాగుతుంది. సాయినిధి పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు. గురుకుల పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారిలో శిరిష దండెపల్లి మండలం ఎల్లారం గ్రామానికి చెందిన విద్యార్థిని కాగా , సాయినిధి నిర్మల్ జిల్లా కు చెందిన విద్యార్థిని అని సమాచారం.

Similar News