సందర్శకులు తస్మాత్‌ జాగ్రత్త!

Update: 2016-09-26 01:00 GMT

చెరువు నిండిందంటే.. ఊర్లో జనం ఓసారి కట్ట మీదకు వెళ్లి చూసి వస్తారు. నదిలోకి నీటి ప్రవాహం వచ్చిందంటే.. ఆ గట్టు మీద ఆడుకోవడానికి పిల్లా జెల్లా అందరూ తరలి వెళ్తారు. అయితే ప్రస్తుతం అలాంటి ముచ్చట్లను కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను చెరువులు, ప్రాజెక్టులు అన్నీ నిండుగానే ఉన్నాయి. జనం వాటిని చూడడానికి ఎగబడే పరిస్థితి ఉంది.

అయితే ఇంకా వాతావరణం పూర్తిస్థాయిలో మామూలుగా మారంనందున, ఇంకా వర్షాలు పొంచి ఉన్నందున సందర్శకులు ఇప్పట్లో నీటి ప్రాజెక్టుల వద్దకు వెళ్లడం కరెక్టు కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎటూ ఇంత నిండుగా ఉన్న ప్రాజెక్టులు మరిన్ని రోజుల పాటూ ఇదే కళతో ఉంటాయని కాబట్టి.. ఇప్పుడే వాటిని చూడాలనే ముచ్చటతో ప్రాజెక్టులు వద్దకు వెళ్లడం, అక్కడ సాహసాలకు ముచ్చటపడి ప్రాణాల మీదకు తెచ్చుచోవడం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Similar News