శుక్రవారం ఏపీలో వైసీపీ నిరసనలు

Update: 2017-01-26 18:28 GMT

ప్రత్యేక హోదా కోసం అందరం ఏకమవుదామని, ఐక్యంగా పోరాడి సాధించుకుందామని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఏపీలో పోలీసులకు వైఖరికి నిరసనగా ఆందోళనలు చేయాలని కోరారు. ఎక్కడకక్కడ అరెస్ట్ లు చేస్తూ భయాందోళనలు సృష్టించారని జగన్ అన్నారు. మహిళలను, విద్యార్థులను అరెస్ట్ లు చేసి వారిపై కేసులు పెట్టారన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఇక రెండేళ్లే ఉంటుందని, దేవుడు దయతలిస్తే ఏడాదిలోనే పడిపోతుందని జగన్ అన్నారు. విద్యార్థులకు కేసులు భయపడవద్దన్నారు. కనీసం ప్రతిపక్ష నేత అని కూడా చూడకుండా రన్ వే పైనే ఆపేశారన్నారు. జల్లికట్టు ఉద్యమాన్ని ఒక స్ఫూర్తిగానే తీసుకుందామని చెప్పారు. జల్లికట్టుతో కలిసకట్టుగా ఉండాలనేదే తన ఆలోచన అని జగన్ చెప్పారు.

Similar News