యూనివర్సిటీలను పటిష్టపర్చేందుకు న్యాయమూర్తులను వీసీలుగా నియమించాలని సంకల్పించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వీసీల నియామక సవరణ బిల్లుపై ఆయన శాసన సభలో మాట్లాడారు. వీసీల నియామకం విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి కొందరు జడ్జీలను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. వీసీల నియామక కమిటీలో ప్రతిపక్ష నేతలకు చోటు కల్పిస్తామని తెలిపారు. యూనివర్సిటీల్లో విచ్చలవిడితనాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.