రైల్లో వేధింపులు భరించలేక ఈ బాలిక....?

Update: 2017-10-24 02:25 GMT

లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తి తప్పించుకునేందుకు ఓబాలిక.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి బయటకు దూకింది. ఈ ఘటన ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ప్రాంతంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక మహిళలకు కేటాయించిన బోగిలో ఎక్కింది. బోగిలో బాలిక ఒక్కతే ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి.. రైలు కదిలిన వెంటనే ఆ బోగిలోకి ఎక్కాడు. అనంతరం బాలిక పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఎమర్జెన్సీ స్టాప్ చైన్ లాగినప్పటికీ అది పని చేయలేదు. ఏం చేయాలో తోచక.. వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి బయటకు దూకేసింది ఆ బాలిక. రైలు పట్టాలపై పని చేస్తున్న కార్మికులు గుర్తించి.. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలికి, చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి. తలకు బలమైన గాయమవడంతో.. 20 కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వేస్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Similar News