రేవంత్ కొత్త మెలికతో ఇరకాటమేనా?

Update: 2018-01-20 07:49 GMT

తెలంగాణలో శాసనసభ్యలను పార్లమెంటు కార్యదర్శులుగానియమించిన వారిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై సోమవారం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చెప్పారు. మొత్తం ఆరుగురు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంటు కార్యదర్శులుగా నియమించారన్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలకు వివిధ పదవులు ఇచ్చారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల తరహాలోనే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Similar News