మరోసారి రాయిటర్స్

తమిళనాడుతో కియా సంప్రదింపులు నిజమేనని మరోసారి స్పష్టంగా రాయిటర్స్ వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ బయటకు తరలించేందుకు కియా చర్యలు జరుపుతోందంటూ రాయిటర్స్ ట్వీట్ చేసింది. ఈ వార్తను [more]

Update: 2020-02-09 08:44 GMT

తమిళనాడుతో కియా సంప్రదింపులు నిజమేనని మరోసారి స్పష్టంగా రాయిటర్స్ వివరణ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ బయటకు తరలించేందుకు కియా చర్యలు జరుపుతోందంటూ రాయిటర్స్ ట్వీట్ చేసింది. ఈ వార్తను రాయిటర్స్ ఉపసాంహరించుకున్నట్టు అధికారపక్ష నేతలు తెలిపారు. ఢిల్లీ ఆటో ఎక్స్ పో సందర్భంగా కియా మోటర్స్ ప్రతినిధులను రాయిటర్స్ సంప్రదించింది. కియా తరలింపు కథనంపై కట్టుబడి ఉన్నామంటూ రాయిటర్స్ మరోసారి స్పష్టం చేసింది. కియా ఎక్కడికీ తరలిపోదంటూ ఏపీ ప్రభుత్వ ప్రకటనను కూడా ప్రస్తావించింది. ఉచితంగా కార్లు, అనర్హులకు ఉద్యోగాలు, డీలర్‍షిప్‍లు ఇవ్వాలంటూ వేధింపులు అంటూ రాయిటర్స్ పేర్కొంది.
త్వరలోనే తమిళనాడు అధికారులతో చర్చలు జరపనుందని పేర్కొంది. కియా తరలింపుపై మరోసారి రాయిటర్స్ కుండబద్దలు కొట్టింది.

Tags:    

Similar News