మంత్రి గంటాపై ఆగ్రహం ఆయన కొడుకుపై తీర్చుకున్నారా?

Update: 2017-06-30 03:49 GMT

రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ నటించిన జయదేవ్ సినిమా పోస్టర్ చించివేత ఇప్పుడు విశాఖలో కలకలం రేపుతోంది. మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో ఈ సంఘటన జరగడంతో ప్రత్యర్థులే ఈ పనికి పాల్పడి ఉంటారని గంటా భావిస్తున్నారు. నర్సీపట్నంలో గల రాజు థియేటర్ లో ఏర్పాటు చేసిన పోస్టర్ ను చించివేశారు. అయితే రాజకీయ కుట్రతోనే అర్ధరాత్రి గంటా రవితేజ నటించిన జయదేవ్ సినిమా పోస్టర్ ను చించివేసినట్లు గంటా అనుచరులు అనుమానిస్తున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News