బ్రేకింగ్ : ప్రత్యేకహోదాకు కట్టుబడి ఉన్నాం

Update: 2018-03-17 06:37 GMT

అఖిల భారత కాంగ్రెస్ ప్లీనరీలో ఏపీ విషయంపై ప్రత్యేక తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని, దీనిని ఖండిస్తూ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, నాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలన్నింటికీ కాంగ్రెస్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించింది. ఈ తీర్మానంపై చర్చించి కాంగ్రెస్ ప్లీనరీ ఆమోదించనుంది. కాంగ్రెస్ 84వ ప్లీనరీ సమావేశాలు జరగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్లీనరీలో ఏపీ విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. గతంలో రాహుల్ కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు.

Similar News