ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆప్ ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్లో ఉన్నారంటూ ఎన్నికల కమిషన్ వారి శాసనసభ్యత్వాలను రద్దు చేసింది. ఈసీ నిర్ణయాన్నిహైకోర్టు కొట్టివేసింది. ఈసీ అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆప్ హైకోర్టును ఆశ్రయించింది.లాభదాయకపదవులపై మరో సారి విచారించాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.