బీజేపీకి దిమ్మ‌తిరిగే షాక్‌

Update: 2017-12-18 07:40 GMT

గుజ‌రాత్‌, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫలితాలు వెలువడ్డాయి. గుజ‌రాత్‌లో అధికార బీజేపీ మరోసారి పాలనా పగ్గాలను చేపట్టబోతోంది. వరుసగా ఆరోసారి గుజరాత్‌లో గెలిచి బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇక హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కూడా బీజేపీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది. క‌డ‌ప‌టి వార్త‌లు అందే స‌రికి హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ 34, కాంగ్రెస్‌ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 68 స్థానాలు ఇక్క‌డ ఉన్నాయి. అయితే ఇక్క‌డ బీజేపీ గెలిచినా దిమ్మ‌తిరిగి పోయే షాక్ ఆ పార్టీకి త‌గిలింది. హిమాచల్‌ ప్రదేశ్ బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్ ధుమాల్ ఓటమి పాలయ్యారు. ఇక్క‌డ నోటాకు 0.9 శాతం ఓట్లు పోల‌య్యాయి.

Similar News