బాబు పంపిన నివేదిక పవన్ కు...!

Update: 2018-02-17 12:18 GMT

పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఏపీ సర్కార్ నివేదిక పంపింది. రాష్ట్ర ప్రభుత్వం మెసెంజర్ ద్వారా 118 పేజీల నివేదిక కమిటీకి పంపింది. ఐఏఎస్ ల ద్వారా నివేదిక పంపమని ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఈ నివేదికలో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, చట్టంలో పొందుపర్చిన అంశాలు, ఇంతవరకూ అమలు చేసిన హామీలపై వివరంగా నివేదిక పంపినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్యాకేజీల వివరాలను కూడా అందులో పొందుపర్చారు. బడ్జెట్ కు ముందు ప్రధాని ఇచ్చిన హామీలను కూడా అందులో ఉంచారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము జేఎఫ్ సికి నివేదిక పంపామని ఏపీ సర్కార్ చెబుతోంది. మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీ, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టొచ్చు కదా? అని అన్నారు. వారు ఎందుకు డెడ్ లైన్ లు పెట్టుకున్నారో తమకు తెలియదన్నారు. జేఎఫ్ సి నివేదిక వచ్చిన తర్వాత మేం కూడా డెడ్ లైన్ పెడతామని పవన్ స్పష్టం చేశారు.

Similar News