బాబు నిర్ణయంలో మార్పు

Update: 2018-04-01 05:46 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈనెల 2,3 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఈనెల 3,4 వ తేదీల్లోకి మార్చుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై అన్ని జాతీయ పార్టీల నేతలను చంద్రబాబు కలవనున్నారు. కేంద్రం ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని జాతీయ నేతలకు చంద్రబాబు వివరించనున్నారు. కేంద్రంపై తన పోరాటానికి మద్దతు కూడగట్టనున్నారు.

Similar News