బలపరీక్షలో నితీష్ దే విజయం

Update: 2017-07-28 07:43 GMT

బీహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెగ్గారు. కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ బలపరీక్షలో దాదాపు 131 మంది ఎమ్మెల్యేలు నితీష్ కు అండగా నిలిచారు. మ్యాజిక్ ఫిగర్ 122 మాత్రమే కావడంతో నితీష్ బలపరీక్షలో నెగ్గినట్లయింది. బీజేపీ, జేడీయూ కలిపి 129 మంది సభ్యుల బలం ఉండగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నితీష్ కే ఓటేసినట్లు తెలుస్తోంది. బీహార్ లో నితీష్ బలపరీక్ష సందర్భంగా నితీష్ కు వ్యతిరేకంగా 108 మంది సభ్యులు మాత్రమే నిలిచారు. ఈ సందర్భంగా బీహార్ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నితీష్ తీరుపై ఆర్జేడీ మండిపడింది. గందరగోళం మధ్యనే నితీష్ బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు.

Similar News