ప్రజలు సమస్యల్లోనే ఉండాలన్నది బాబు ఆలోచన

టీడీపీ నేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. నలభై ఏళ్ల [more]

Update: 2020-05-12 07:54 GMT

టీడీపీ నేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం దుర్మార్గపు ఆలోచనలే నేర్పిందా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. నీకున్న పచ్చ మీడియాతో ప్రభుత్వాన్ని ప్రతి క్షణమూ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యలోనే ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారన్నారు. ప్రతి దానికి చంద్రబాబు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందన్నారు. నీకంటే చిన్న వయసున్న జగన్ మంచి పనులు చేస్తుంటే ఓర్చుకోలేవా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? అని నిలదీశారు.

Tags:    

Similar News