పసుపు పార్టీకి పవన్ వార్నింగ్

Update: 2018-03-16 07:43 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ సర్కార్ కు 48 గంటల డెడ్ లైన్ విధించారు. గుంటూరు జిల్లాలో కలుషిత తాగు నీరు తాగి 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అతిసార బారిన పడిన బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసమే పనిచేస్తున్నాయని, ఈ ఘటనకు బాధ్యులెవరని ప్రశ్నించారు. 20 మంది ఎమ్మెల్యేలు చనిపోతే ఎలా ఉంటుందన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ అంటే ఇదేనా అని నిలదీశారు. అమరావతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతామని చెబుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఏమని చూపిస్తారని ఎద్దవా చేశారు. రాజకీయ వ్యవస్థ డ్రైనేజీ లా కుళ్లిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తాను నిలదీయగలనని, నోటికొచ్చినట్లు మాట్లాడితే తాను కూడా ఇంకా గట్టిగా మాట్లాడాల్సి వస్తుందని టీడీపీ నేతలకు పవన్ హెచ్చరించారు. 48 గంటల్లో గుంటూరు అతిసార సమస్యపై ప్రభుత్వం స్పందించకుంటే బంద్ కు పిలుపునిస్తానని, అవసరమైతే దీక్షకు కూర్చుంటానని తెలిపారు.

Similar News