వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేత జగన్ ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నెల్లూరులోని కస్తూరిదేవి గార్డెన్కు చేరుకుంటారు. మాగంటలేవుట్లో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. జగన్ సమక్షంలో పలువురు వైసీపీలో చేరనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు.