నాలుగేళ్లు బాబు ఆగింది ఇందుకేనన్న టీడీపీ

Update: 2018-02-23 06:57 GMT

నాలుగేళ్లు ఆగింది చంద్రబాబు పదవుల కోసం కాదని, రాష్ట్ర అభివృద్ధి గురించేనని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ పీఠం కదిలే పరిస్థితి ఈరోజు రావడానికి చంద్రబాబు కారణమన్నారు. సాక్షాత్తూ కమల్ హసన్ చంద్రబాబు తన హీరో అని ప్రకటించిన సంగతి సోము వీర్రాజుకు తెలియలేదా? అని ప్రశ్నించారు. విలువలున్న నేతగా చంద్రబాబుకు దేశంలో ఎంతో పేరుందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడుతున్నచంద్రబాబుపై బీజేపీ విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కూడా చంద్రబాబే అని గుర్తుంచుకోవాలన్నారు. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబునా ఇన్ని మాటలనేది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబును టార్గెట్ చేయడం మీవల్ల కాదని బీజేపీ నేతలను హెచ్చరించారు.

Similar News