తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయే అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి కోసం కేంద్ర పార్టీ ఏకాభిప్రాయం తీసుకుంటుందని తెలిపిన ఆయన విభజన చట్టంలోని హామీలను దశలవారీగా నెరవేరుస్తామన్నారు