డ్రగ్స్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

Update: 2017-07-28 13:17 GMT

డ్రగ్స్ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ వాడేవారు బాధితులేనని నేరస్థులు కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం డ్రగ్స్ వ్యవహారంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీని ప్రముఖులను బాధితులను గానే చూడాలని కేసీఆర్ చెప్పారు. డ్రగ్స్ వాడే వారిని విచారిస్తే అసలు నిందితులు బయటకు వస్తారని పోలీసు అధికారులు తనతో చెప్పారన్నారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ నగరంగా చేయడమే తమ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. గత కొద్దిరోజులుగా వరుసగా టాలివుడ్ ను టార్గెట్ చేస్తున్నారన్న వార్తలు వస్తుండటం... కొందరు విచారణపై కామెంట్స్ చేయడంతో కేసీఆర్ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

Similar News