టీడీపీని ఇబ్బంది పెట్టిన వెంకయ్య వ్యాఖ్యలు...!

Update: 2017-12-31 08:27 GMT

అమరావతికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందికరంగా మారాయి. వెంకయ్యనాయుడు మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిరాయింపులపై అడిగిన ప్రశ్నకు ఫిరాయింపులపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. తాను ఫిరాయింపులపై సంచలన నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఏపీలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఇంతవరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యాఖ్యలతో పాటు వెంకయ్య నాయుడు ఈరోజు దేశంలో క్యాష్, క్యాస్ట్, కమ్యునిటీ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. అలాగే అమరావతిలో పరిపాలనా సౌలభ్యంగా అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలు ఉండాలన్నారు. డిజైన్లను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే ఖారారు చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత ప్రొటోకాల్ తనను ఇబ్బంది పెడుతున్న మాట నిజమేనని వెంకయ్య వ్యాఖ్యానించారు.

Similar News