టీఆర్ఎస్ నేత దారుణ హత్య

Update: 2017-07-13 13:51 GMT

వరంగల్ టీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. వరంగల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కు చెందిన అనిశెట్టి మురళిని ప్రత్యర్థులు కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమంటున్నారు పోలీసులు. అనిశెట్టి మురళి గతంలో తెలుగుదేశం వరంగల్ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత మురళి టీఆర్ఎస్ లో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్ జనార్థన్ హత్య కేసులో మురళి హస్తం ఉందని అనుమానించిన ప్రత్యర్థులు సమయం కోసం వేచి చూసి మురళిని దారుణంగా నరికి చంపారు. జనార్థన్ హత్య జరిగి దాదాపు ఇరవై అయిదేళ్లు అవుతుంది. అయితే ఆ కక్షతోనే ప్రత్యర్థులు మురళిని హత్య చేశారా? మరే కారణాలా? అన్నది పోలీసులు విచారిస్తున్నారు. మురళిని హత్యచేసిన నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. దీంతో వరంగల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Similar News