జగన్ పాదయాత్రతోనే హోదా గుర్తొచ్చిందా?

Update: 2018-03-28 14:21 GMT

జగన్ పాదయాత్రతోనే టీడీపీకి ప్రత్యేక హోదా గుర్తొచ్చిందా అని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. శాసనసభను రాజకీయ వేదికగా సీఎం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ సభ పెట్టి టీడీపీ అవినీతిని గురించి ప్రశ్నించగానే బీజేపీతో జతకట్టారని విమర్శలు మొదలు పెట్టారని విష్ణుకుమార్ రాజు నిలదీశారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం కృషి చేసిన ఎన్టీఆర్ కు టీడీపీ నేతలు ఏం చేశారో ప్రజలకు తెలుసునన్నారు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం గత ఎన్నికల్లో తహతహలాడారన్నారు. బీజేపీ లేకుంటే టీడీపీ గెలిచేదా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో టీడీపీకి, ప్రతిపక్ష పార్టీకి మధ్య ఓట్ల తేడా ఐదు లక్షలు మాత్రమేనని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. విపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈపరిస్థితి లేదన్నారు. బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించబోవన్నారు.

Similar News