వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నిలిచిపోయింది. ఈరోజు ఉదయం జగన్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికే భారీ వర్షం కురిసింది. దీంతో జగన్ పాదయాత్రను నిలిపేశారు. వర్షం కారణంగా ఈరోజు పాదయాత్రను జగన్ నిలిపేసినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చింతపల్లిలోనే జగన్ నిలిచిపోయారు.