జగన్ ఎంత ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలి...!

Update: 2018-02-05 06:26 GMT

బీజేపీ నేత సోము వీర్రాజుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న ఫైర్ అయ్యారు. బీజేపీ తరుపునమాట్లాడుతున్నారా? లేక వైసీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి మాట్లాడుతున్నారో చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. సోము వీర్రాజుకు జగన్ తో ఎంత ప్యాకేజీతో డీల్ కుదిరిందో చెప్పాలన్నారు. రాజమండ్రిలో అమిత్ షా సభకు ఎంత కలెక్ట్ చేశారో చెప్పాలని బుద్ధావెంకన్న సోము వీర్రాజును ప్రశ్నించారు. వైసీపికి ఎంతకు అమ్ముడు పోయారో చెప్పాలన్నారు. మిత్రపక్షంగా ఉండి తమపై విమర్శలు చేయడం తగదన్నారు. సోము వీర్రాజు అజెండా వైసీపీదా? బీజేపీదా? చెప్పాలన్నారు. చంద్రబాబును విమర్శించే స్థాయిబీజేపీ నేత సోము వీర్రాజుకు లేదన్నారు. తమ దయాదాక్షిణ్యాలతో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. వైసీపీకి, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందమేమిటో చెప్పాలన్నారు. మొత్తం మీద బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

Similar News