చంద్రబాబు..ఛార్లెస్ శోభరాజ్ కన్నా...

Update: 2018-03-27 07:36 GMT

చంద్రబాబు ఛార్లెస్ శోభరాజ్ కన్నా నేరగాడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు పార్టీలోనే నేరగాళ్లు ఉన్నారన్నారు. తనను విజయమాల్యాతో చంద్రబాబు పోల్చడంపై విజయసాయి మండిపడ్డారు. తెలుగదేశం పార్టీ తరుపున కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి మారిషస్ బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన నేరగాడని అన్నారు. ఆయన కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయిందన్నారు. చంద్రబాబు మంత్రి వర్గంలో ఎమ్మెల్యే పదవి కోసం వదినను చంపిన ఘనుడున్నాడని చెప్పారు. చంద్రబాబు 18 కేసుల్లో నిందితుడని, అన్నింటినీ మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నాడని విజయసాయి రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. తాను రాజ్యసభలో ప్రధానికి పాదాభివందనం చేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సభలోకి ప్రవేశించేటప్పుడు ఛైర్మన్ తో పాటు ఇతర పెద్దలకు నమస్కారం చేయడం సంస్కారం అని వారు గుర్తుంచుకోవాలన్నారు. తాను చంద్రబాబు కన్పించినా ఆయనకు ముఖ్యమంత్రిగా నమస్కారం చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు.

Similar News