గాలి జనార్ధన్రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఓఎంసీ కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ కేసును ప్రత్యేక కోర్టు విచారణ చేస్తున్నందుకు ప్రస్తుత సమయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో తదుపరి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది.