కోల్కత్తాలో ఫ్లైఓవర్ కూలి 21మంది మృతి!

Update: 2016-03-31 16:27 GMT

కోల్ కతాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో 21 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. నగరంలోని బడాబజార్ ప్రాంతంలోకి గిరీష్ పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కొసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా మరో నూట యాభై మంది వరకూ శిథిలాల కింద చిక్కుకున్నారు. మృతుల సంఖ్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగి మృతదేహాలను వెలికితీస్తున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు చొప్పున పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గాయపడిన కుటుంబాలకు రెండు లక్షలు చొప్పున పరిహారం చెల్లించనున్నారు.

Similar News