కోలుకుంటున్న అమెరికాలోని తెలుగు యువకుడు

Update: 2017-06-09 07:36 GMT

అమెరికా కాలిఫోర్నియాలో కాల్పుల ఘటనలో గాయపడిన తెలంగాణ యువకుడు ముబీన్ అహ్మద్ కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. క్యాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్ లో చికిత్స పొందుతున్న ముబీన్ కోలుకుంటున్నారని సుష్మాతెలిపారు. ముబీన్ అక్కడ ఎంబీఏ చదువుకుంటూ ఒక పెట్రోలు బంకులో పనిచేస్తున్నాడు. పెట్రోలు బంకుకు వచ్చిన నల్లజాతీయులు ముబీన్ ను డబ్బులు డిమాండ్ చేశారు. అయితేముబీన్ అందుకు తిరస్కరించడంతో నల్లజాతీయులు ముబీన్ కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల ఘటనలో గాయపడిన ముబీన్ ప్రమాదం నుంచి బయటపడినట్లు సుష్మా ట్వీట్ చేశారు. అక్కడి పోలసులతో తాము మాట్లాడుతున్నట్లు సుహ్మా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన ముబీన్ ఎంబీఏ చదివేందుకు అమెరికాకు 2015లో వెళ్లారు. ముబీన్ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Similar News