కర్ణాటకలో ఘోరం: 25 మంది మృతి

Update: 2017-03-18 07:56 GMT

కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా రాంపురం దగ్గర జరిగింది. హైవేపై వెళుతున్న రెండు ఆటోలను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆటోల్లో కూలీలు ప్రయాణిస్తుండగా లారీ వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News