ఏపీ సచివాలయంలో పోస్టర్ల కలకలం....

Update: 2017-03-03 09:30 GMT

ఏపీ సెక్రటేరియెట్‌లో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు పోస్టర్లు వేసుకునే వరకు వెళ్లాయి. ఇటీవల సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో పాత కార్యవర్గమే ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ముఖ్యనేత ఒకరు జోక్యం చేసుకోవడంతోనే ఎన్నిక సులువైందనే ఆరోపణలు ఉన్నాయి. మురళీకృష్ణ., వెంకటరామిరెడ్డి ప్యానళ్లు ఎన్నికల బరిలో దిగగా మురళీకృష్ణ ప్యానల్‌ మళ్లీ గుర్తింపు సంఘంగా గెలిచింది. ఇక తాజాగా సెక్రటేరియెట్‌లో మహిళా ఉద్యోగినుల సంఘం ఎన్నికల్లో మాజీ అధ్యక్షురాలే మళ్లీ ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోస్టర్లు వెలిశాయి.

సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సత్యసులోచన ప్రయత్నిస్తున్నారంటూ సెక్రటేరియట్‌ అన్ని బ్లాకుల లిఫ్ట్‌ల ఎదుట పోస్టర్లు అంటించారు. జిఏడిలో మేనేజ్‌ చేసి సులోచన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని., మహిళా సంఘాల మీద గౌరవం ఉంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోస్టర్లు వెలియడంతో కలకలం రేగింది.

Similar News