ఎమ్మెల్యేలపై బాబు సీరియస్

Update: 2017-07-17 06:55 GMT

రాష్ట్రపతి ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు వేశారు. తొలి ఓటును ఆయనే వేశారు. తర్వాత ఓటు స్పీకర్ కోడెల శివప్రసాదరావు వేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజయవాడలో ఓటు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ఉదయమే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. మాక్ పోలింగ్ ను నిర్వహించారు. మాక్ పోలింగ్ కు హాజరుకాని ఎమ్మెల్యేలపై చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కనుగొనాలని చీఫ్ విప్ ను ఆదేశించారు. జగన్ కూడా తన ఎమ్మెల్యేలతో మాక్ పోలింగ్ ను నిర్వహించారు.

Similar News