ఉద్యోగులపై మంత్రి యనమల ఘాటు వ్యాఖ్యలు

Update: 2017-07-10 14:10 GMT

కృష్ణా జిల్లా అధికారులతో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. ఉద్యోగుల తీరుపై మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. దీనివల్ల అనుకున్న ఫలితాలను సాధించలేకపోతున్నామని చెప్పిన యనమల ప్రభుత్వ పథకాలను ఉద్యోగులు ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బదిలీలు అవసరమైతేనే ఎమ్మెల్యేలు గుర్తొకొస్తున్నారని, పనిచేయని అధికారులపై బదిలీ వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి పనిచేయాల్సిందేనన్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Similar News