ఆ హత్యతో నాకేంటి సంబంధమన్న డిప్యూటీ సీఎం

Update: 2017-05-22 08:21 GMT

పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి నారాయణరెడ్డి హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. నారాయణ రెడ్డి తనక సమ ఉజ్జీయే కాదన్నారు. నారాయణ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయని, హత్య ఎవరి పని అయిఉంటుందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందన్నారు. తనకు హత్యా రాజకీయాలు చేసే అలవాటు లేదన్న కేఈ నారాయణ రెడ్డి హత్య దురదృష్ణకరమన్నారు. పోలీసుల దర్యాప్తులో అసలు నిందితులు ఎవరో తెలుస్తుందన్నారు. నారాయణరెడ్డికి గన్ లైసెన్సు రెన్యువల్ చేయలేదన్న విషయం తనకు తెలియదన్నారు. అనవసరంగా తన కుటుంబంపై లేని పోని అభాండాలు వేయడం సరికాదని వైసీపీ, కాంగ్రెస్ నేతలకు కేఈ హితవు పలికారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. నా వారసుడు కాబట్టే తన కొడుకుపై అభాండాలు వేస్తున్నారని కేఈ మనస్తాపం చెందారు. నిజాలు నిలకడమీద తెలుస్తాయన్న కేఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా ఉన్నాయన్నారు.

Similar News