పార్టీ ఎమ్మెల్యేలకు వైకాపా విప్ జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో శాసనసభకు తప్పకుండా హాజరై ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఆదేశించింది. పార్టీ వీడిన 8మంది శాసనసభ్యులకూ వైకాపా విప్ జారీ చేసింది. పార్టీ వీడిన ఎమ్మెల్యేలకు స్వయంగా వెళ్లి విప్ ఆదేశాలు అందించాలని, నిరాకరించిన పక్షంలో ఎమ్మెల్యేల నివాసానికి విప్ ప్రతిని అతికించాలని వైకాపా నిర్ణయించింది.