భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ను భారతీయ జనతా పార్టీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం గురించి పార్టీ వర్గాలు శ్రీశాంత్తో చర్చలు జరిపారు. తనకు కొంత సమయం కావాలని చెప్పినట్లు సమాచారం. శ్రీశాంత్ తన కుటుంబసభ్యులతో ఎన్నికల్లో పోటీ చేసే దానిపై చర్చలు జరుపుతున్నారు. వారు ఒప్పుకొంటే త్రిపునితుర నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎక్సైజ్ మంత్రి కె.బాబుకి ప్రత్యర్థిగా శ్రీశాంత్ బరిలో దిగుతారు