అంతర్జాతీయ ఇంధన సదస్సు విజయవాడలో ప్రారంభం!

Update: 2016-04-07 12:20 GMT

విద్యుత్ పొదుపుతో దేశంలో 40 వేల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని ఎపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఇంధన సదస్సు గురువారం విజయవాడలో ప్రారంభమైంది. అమెరికా, బ్రిటన్ సహా 35 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో తొలిసారి విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన ఖ్యాతి ఆంధ్రప్రదేశ్ కు దక్కిందని అన్నారు. విద్యుత్ రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో ఎల్ఈడీ బల్బుల వినియోగంతో చాలా వరకూ విద్యుత్ ఆదా చేయగలిగామని చెప్పారు.

Similar News