బ్రేకింగ్ : హత్యాయత్నంపై హైకోర్టులో పిటీషన్

Update: 2018-10-26 06:20 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి రిట్ పిటీషన్ దాఖలు చేశారు. హత్యాప్రయత్నం తర్వాత డీజీపీ, మంత్రులు, ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలు కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ అధికారుల వివరణ తీసుకోవాలని ఆయన కోరారు. ఈ పిటీషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Similar News