వాళ్లపై వైసీపీ మళ్లీ….!!!

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘానికి వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, పోలీస్ వ్యవస్థను ఆయన తెలుగుదేశం [more]

Update: 2019-04-08 06:23 GMT

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘానికి వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, పోలీస్ వ్యవస్థను ఆయన తెలుగుదేశం పార్టీ కోసం వాడుకుంటున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావును విధుల నుంచి వెంటనే తప్పించాలని కోరారు. లా ఆండ్ ఆర్డర్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయనను సైతం విధుల నుంచి తప్పించాలని కోరారు. ఆయనతో పాటు ఓఎస్డీలుగా ఉన్న మాజీ అధికారులు యోగానంద్, మాధవరావు సైతం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. డీజీపీ ఠాకూర్ కనసన్నల్లోనే వీరంతా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ హెడ్ క్వార్టర్స్ సహా అన్ని జిల్లాల్లోని ఎన్నికల కేంద్రాల్లో పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Tags:    

Similar News